ETV Bharat / state

రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ఖమ్మం జిల్లా తల్లాడలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. సంగసాని తిరుపతిరావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్​కు ఇరు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

author img

By

Published : Feb 20, 2021, 2:05 PM IST

two states level kabaddi tournament in khammam district
తల్లాడలో తెలంగాణ, ఏపీ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను ఖమ్మం జిల్లా తల్లాడలో... తల్లాడ సొసైటీ ఛైర్మన్ రెడ్డెం వీర మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. సంగసాని తిరుపతిరావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్​కు ఇరు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

two states level kabaddi tournament in khammam district
తల్లాడలో తెలంగాణ, ఏపీ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

మొదటి రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. పోటీలను తిలకించేందుకు వివిధ మండలాల నుంచి క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా... పాల్గొన్న మంత్రి, ఎంపీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను ఖమ్మం జిల్లా తల్లాడలో... తల్లాడ సొసైటీ ఛైర్మన్ రెడ్డెం వీర మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. సంగసాని తిరుపతిరావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్​కు ఇరు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

two states level kabaddi tournament in khammam district
తల్లాడలో తెలంగాణ, ఏపీ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

మొదటి రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. పోటీలను తిలకించేందుకు వివిధ మండలాల నుంచి క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా... పాల్గొన్న మంత్రి, ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.