ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ... మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి డివిజన్లను చుట్టేస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు.
నగరంలోని 26వ డివిజన్లో తెరాస అభ్యర్థి పునుకొల్లు నీరజ భారీర్యాలీతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కొబ్బరిబొండాలు కొట్టి, కూరగాయలు తూకం వేస్తూ ఉత్సాహ పరిచారు. 14వ డివిజన్లో తెరాస అభ్యర్థి కురాకుల వలరాజు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
నమూనా బ్యాలెట్ పత్రం అందిస్తూ ఓటు అభ్యర్థించారు. నగరంలో తెరాస అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేపట్టిన ఎంపీ నామ నాగేశ్వరరావు... తెరాస బలపరిచిన సీపీఐ అభ్యర్థి క్లెమెంట్కు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.
ఇదీ చూడండి: తెరాస-భాజపాలతో నగరానికి ఒరిగిందేం లేదు : రేవంత్ రెడ్డి