ఖమ్మంలో కరోనా పాజిటివ్ నమోదైన బీకే బజార్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. తాజాగా ఎనిమిదో కేసు నమోదు కావడం వల్ల ఈ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మంత్రి ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరకులు అందజేశారు.
14 రోజుల వరకు ఎవరు బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కట్టుదిట్టంగా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానికులతో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి చర్చించారు. మంత్రి వెంట కలెక్టర్ ఆర్వి కర్ణన్, పురపాలిక కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు ఉన్నారు.