ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని లీల సుందరయ్య నగర్లో నాలుగు ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇళ్లలో చొరబడి నగదు, వెండి, బంగారు వస్తువులను అపహరించారు. గత నెలలో విశ్రాంత పోలీస్ ఇంట్లో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీ కాగా అదే ప్రాంతంలో దొంగలు మళ్లీ హల్చల్ చేయటం వల్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వైరాతో పాటు ఏన్కూరులో ఇటీవల దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఇంట్లో సుమారు లక్ష రూపాయలతో పాటు బంగారు వస్తువులు దోపిడీకి గురయ్యాయి. జిల్లాలో పలుచోట్ల వరుసగా దొంగతనాలు జరగటం వల్ల ప్రజలు రాత్రివేళ భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాలు