ఎన్ఎస్ఎస్ క్యాంపు.. విద్యార్థి మార్పుకు ఎంతగానో దోహదపడుతుందని సత్తుపల్లి ఎంపీపీ దొడ్డ హైమావతి అన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం.. శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఎంపీపీ ప్రారంభించారు.
శిబిరంలో భాగంగా గ్రామంలో శ్రమదానం, ఇంకుడు గుంతలు తవ్వడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఎంపీపీ హైమావతి తెలిపారు. మద్యం, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు విద్యార్థులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
శిబిరంతో గ్రామం పరిశుభ్రంగా ఉండడం, విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకోవాలని సత్తుపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ కోసంపూడి రమేశ్ సూచించారు.
ఇదీ చూడండి: 'వేసవి సమీపిస్తోంది... జాగ్రత్త వహించండి'