సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 3లక్షల విలువ చేసే.. బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, కుట్టుమిషన్లు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లింబ్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వికలాంగులకు పంపిణీ చేశారు.
ట్రై సైకిళ్లను అందజేసిన దాతలను మంత్రి అభినందించారు. ప్రతి ఏడాది తమ సంస్థ ద్వారా పేదలకు సహాయం చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన: తరుణ్ చుగ్