ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య(87) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004లో సీపీఎం తరఫున కట్టా వెంకటనర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.
మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వెంకటనర్యయ్య పనిచేశారని కొనియాడారు. వెంకటనర్సయ్య సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని వెల్లడించారు. ప్రతిక్షణం ప్రజల బాగుకోసం కృషిచేసి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. వెంకటనర్సయ్య కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీమంత్రి తుమ్మల కూడా మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. కట్టా వెంకటనర్సయ్య జీవితకాలం ప్రజల పక్షాన పోరాడారని మంత్రి పువ్వాడ గుర్తు చేసుకున్నారు. కట్టా వెంకటనర్సయ్య మరణం మధిరకు తీరనిలోటని బాధపడ్డారు. రైతుబిడ్డగా వెంకటనర్సయ్య రైతులకు వెన్నుదన్నుగా నిలిచారని ఎంపీ నామ అన్నారు.