రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నియామకంపై కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తెరాస నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంపిణీ చేశారు. వినోద్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడే నాయకుడిని గుర్తించి అధిష్ఠానం సముచిత స్థానం కేటాయించడం అభినందనీయమని కొనియాడారు.
ఇవీ చూడండి: భార్య కాపురానికి రావడంలేదని ట్యాంక్పై నుంచి దూకిన భర్త