ETV Bharat / state

అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం

author img

By

Published : May 6, 2021, 8:34 PM IST

బంగాల్​లో ఎన్నికల ఘర్షణలు జరిగాయని దీక్షలు చేయడం కాదని... రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భాజపా నేతలకు పొన్నం ప్రభాకర్​ సూచించారు. భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర సర్కారుపై పోరాడాలని పొన్నం డిమాండ్​ చేశారు.

ponnam prabhakar
అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం

పక్క రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయని దీక్షలు చేయడం కాదని, రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భాజపా నేతలకు టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ హితవు పలికారు. బంగాల్​లో అల్లర్లు జరిగాయని దీక్షలు చేస్తున్న భాజపా నేతలు... కొవిడ్​ వ్యాక్సిన్​ లేదని, రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగముంటుందన్నారు.

రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే ఆందోళనలు చేయడం రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమేనని... భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటు చేయాలని పొన్నం పేర్కొన్నారు.

అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం

ఇదీ చదవండి: తడిచిన ధాన్యం సర్కారే కొంటుంది: గంగుల

పక్క రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయని దీక్షలు చేయడం కాదని, రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భాజపా నేతలకు టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ హితవు పలికారు. బంగాల్​లో అల్లర్లు జరిగాయని దీక్షలు చేస్తున్న భాజపా నేతలు... కొవిడ్​ వ్యాక్సిన్​ లేదని, రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగముంటుందన్నారు.

రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే ఆందోళనలు చేయడం రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమేనని... భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటు చేయాలని పొన్నం పేర్కొన్నారు.

అలా ఆందోళనలు చేయడం ప్రజలను అవమానపర్చడమే: పొన్నం

ఇదీ చదవండి: తడిచిన ధాన్యం సర్కారే కొంటుంది: గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.