కరీంనగర్ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరేలా తెరాస ప్రభుత్వం ఆగమేఘాలపై అసెంబ్లీలో మున్సిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టిందని భాజపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తున్న కమలం శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే లబ్ధిదారులు అందరికీ రెండు పడక గదుల ఇళ్లను అందజేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః అరెస్టులు, లాఠీఛార్జీలే తెరాస విధానమా : భాజపా