కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో నీరు వృథాగా పోకుండా ఏర్పాటు చేసిన చెక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అప్పటి నుంచి నీరు వృథాగా పోతూ చెరువు ఖాళీ అయిపోతోంది. ఈ చెరువు నుంచి మొత్తం ఏడు గ్రామాల వ్యవసాయ భూములకు నీరందుతోంది. గత నెల 24న చెరువులో 3 లక్షల 20 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే జాజాల సురేందర్ వదిలారు. ప్రస్తుతం నీటి వృథాతో చేపలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని... అలాగే ఏడు గ్రామాల రైతన్నలకు నష్టం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని కాపాడాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: లైవ్: జిన్పింగ్ రెండో రోజు టూర్ అప్డేట్స్