కామారెడ్డి మున్సిపాలిటీలోని 41 వార్డులో 101వ పోలింగ్ బూత్లో రీపోలింగ్ మొదలైంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న అర్ధరాత్రి కొన్ని వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎక్కువమందిని గుంపులుగా ఉండటానికి అనుమతి ఇవ్వడం లేదు. అధికారులు చాలా క్షుణ్ణంగా ప్రతి ఓటరును గమనించి, వాళ్ల ధ్రువీకరణ పత్రాలను సరి చూసుకున్న తర్వాతే ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు.
ఇవీ చూడండి: ఎంబీబీఎస్ సీట్లు ఎన్నో.. పీజీలోనూ అన్నే