ETV Bharat / state

ఎమ్మెల్యే సురేందర్​ కోలుకోవాలని ప్రత్యేక పూజలు!

కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఎమ్మల్యే జాజల సురేందర్​ త్వరగా కోలుకోవాలని నియోజవర్గ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ రమాదేవి, ఎంపీపీ రవి ఆధ్వర్యంలో చేసిన ఈ పూజల్లో ప్రజల మనిషి ఎమ్మెల్యే సురేందర్​ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని మొక్కుకున్నారు.

author img

By

Published : Aug 22, 2020, 3:41 PM IST

People Held Special Pooja in Tadwai for Mla Speedy Recovery from corona
ఎమ్మెల్యే సురేందర్​ కోలుకోవాలని ప్రత్యేక పూజలు!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు జాజల సురేందర్​ మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్​తో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. సమస్యల పరిష్కారానికై కృషి చేసే తమ ఎమ్మల్యే త్వరగా కోలుకోవాలని జెడ్పీటీసీ రమాదేవి, ఎంపీపీ రవి, కార్యకర్తలు తాడ్వాయిలోని శబరిమాత, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు జాజల సురేందర్​ మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్​తో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. సమస్యల పరిష్కారానికై కృషి చేసే తమ ఎమ్మల్యే త్వరగా కోలుకోవాలని జెడ్పీటీసీ రమాదేవి, ఎంపీపీ రవి, కార్యకర్తలు తాడ్వాయిలోని శబరిమాత, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.