కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు జాజల సురేందర్ మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. సమస్యల పరిష్కారానికై కృషి చేసే తమ ఎమ్మల్యే త్వరగా కోలుకోవాలని జెడ్పీటీసీ రమాదేవి, ఎంపీపీ రవి, కార్యకర్తలు తాడ్వాయిలోని శబరిమాత, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?