విత్తనం విత్తినప్పటి నుంచి పంటను పండించి అమ్ముకునే వరకు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివిధాలా అండగా ఉంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల 6 లక్షల రూపాయలతో నిర్మించనున్న 23 రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు కలెక్టర్ శరత్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్డు పక్కన మొక్కలు నాటారు.
పంట వేసే సమయంలో పెట్టుబడి సాయం అందించి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రతి క్లస్టర్కు 22 లక్షల రూపాయలతో ఒక రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన నిర్ణయాలు ఈ వేదికల ద్వారా తీసుకోవచ్చు.
-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్