శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడిమేట్ గ్రామంలో మహాదేవుని గుట్టకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మూడో సోమవారం అవడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇవీ చూడండి : మట్టి గణపతిని పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి