ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన: భూ కబ్జాను అడ్డుకున్న అధికారులు - భిక్కనూరు మండలంలో భూకబ్జాను అడ్డుకున్న తహసీల్దార్

ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికారులు భూ కబ్జాను అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లిలోని (చైతన్యనగర్) ప్రభుత్వ స్థలంపై 'పాగా వేసేందుకు పునాదులు' శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు విచారణ చేపట్టి భూమి అన్యాక్రాంత కాకుండా బోర్డు ఏర్పాటు చేశారు.

land grab stopped by revenue officers in bhiknoor mandal in kamareddy district
భూ కబ్జాను అడ్డుకున్న అధికారులు
author img

By

Published : Feb 17, 2021, 6:37 PM IST

అన్యాక్రాంతానికి గురైన విలువైన భూములను ఈనాడు- ఈటీవీ భారత్ కథనం వెలుగులోకి తెచ్చింది. పేదల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కబ్జాదారులు ప్రయత్నాలు మొదలెట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లిలో (చైతన్యనగర్) ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. దీనిపై 'పాగా వేసేందుకు పునాదులు' శీర్షికతో ఈనాడు- ఈటీవీ భారత్​ కథనం ప్రచురించింది. దీంతో గ్రామస్థుల ఫిర్యాదుతో తహసీల్దార్​ గోవర్ధన్ విచారణ చేపట్టారు. భూమి కబ్జాకు గురి కాకుండా బోర్డు ఏర్పాటు చేశారు.

స్థిరాస్తి వ్యాపారుల కన్ను

చైతన్యనగర్​లో కూలీలకు కేటాయించని అర ఎకర పొలాన్ని ఆక్రమించేందుకు స్థిరాస్తి వ్యాపారులు ప్రయత్నించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఖాళీ భూమిని చదును చేసి.. ఇళ్లు నిర్మించేందుకు సిమెంట్​, ఇసుక, ఇటుకలు తెప్పించారు. ఈ విషయంపై స్థానికులు తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. వారు స్పందించపోవడంతో ప్రజావాణిలో జిల్లా పాలనాధికారికి విన్నవించారు. ఈ కాలనీలో మరో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉందని.. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి

అన్యాక్రాంతానికి గురైన విలువైన భూములను ఈనాడు- ఈటీవీ భారత్ కథనం వెలుగులోకి తెచ్చింది. పేదల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కబ్జాదారులు ప్రయత్నాలు మొదలెట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లిలో (చైతన్యనగర్) ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. దీనిపై 'పాగా వేసేందుకు పునాదులు' శీర్షికతో ఈనాడు- ఈటీవీ భారత్​ కథనం ప్రచురించింది. దీంతో గ్రామస్థుల ఫిర్యాదుతో తహసీల్దార్​ గోవర్ధన్ విచారణ చేపట్టారు. భూమి కబ్జాకు గురి కాకుండా బోర్డు ఏర్పాటు చేశారు.

స్థిరాస్తి వ్యాపారుల కన్ను

చైతన్యనగర్​లో కూలీలకు కేటాయించని అర ఎకర పొలాన్ని ఆక్రమించేందుకు స్థిరాస్తి వ్యాపారులు ప్రయత్నించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఖాళీ భూమిని చదును చేసి.. ఇళ్లు నిర్మించేందుకు సిమెంట్​, ఇసుక, ఇటుకలు తెప్పించారు. ఈ విషయంపై స్థానికులు తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. వారు స్పందించపోవడంతో ప్రజావాణిలో జిల్లా పాలనాధికారికి విన్నవించారు. ఈ కాలనీలో మరో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉందని.. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.