కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవునిపల్లి గ్రామంలో ఇవాళ జోరుగా వర్షం కురిసింది. ఏకధాటిగా గంటసేపు వర్షం కురవగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. మున్సిపాలిటీ వ్యాప్తంగా నాళాలు పొంగిపొర్లాయి. కామారెడ్డి మిగతా ప్రాంతాల్లో వర్షం కురవలేదు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామాల్లో కూడా జోరుగా వర్షం కురిసింది. జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది రోజులుగా ఎండతీవ్రత పెరగడం వల్ల జనాలు వేడికి తాళలేకపోయారు. గురువారం.. ఒక్కసారిగా వర్షం కురవగా వాతావరణం చల్లబడి.. ప్రజలకు ఉపశమనం లభించింది.
ఇదీ చదవండిః భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్కు అంతరాయం