పెట్రోల్, డీజిల్ను తక్కువగా వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలంటూ... 2కే మారథాన్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పెట్రోల్ బంకుల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, బంకుల్లోని కార్మికులతో కలిసి 'సేవ్ ద ఫ్యూయల్.. సేవ్ ద ఎన్విరాన్మెంట్' అంటూ నినాదాలు చేశారు. కాలుష్య నివారణకు.. సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణాను వాడాలని సూచించారు.
ఇదీ చూడండి: తల్లి మందలించిందని... తనువు చాలించింది