ETV Bharat / state

జూరాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

author img

By

Published : Jul 31, 2019, 11:44 PM IST

ఎగువ రాష్ట్రాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1054 అడుగులు కాగా ప్రస్తుతం 1044 అడుగులకు చేరింది.

జూరాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు లక్షా 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1054 అడుగులు కాగా ప్రస్తుతం 1044 అడుగులకు చేరింది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారడం వల్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ ద్వారా సుమారు 20 నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు కృష్ణా నదిలోకి వదిలారు. ఇక నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలకు, రామన్​పాడు ప్రాజెక్టులకు కూడా నీటిని వదులుతున్నారు.

జూరాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

ఇవీచూడండి: నీటి వివాదాల బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు లక్షా 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1054 అడుగులు కాగా ప్రస్తుతం 1044 అడుగులకు చేరింది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారడం వల్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ ద్వారా సుమారు 20 నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు కృష్ణా నదిలోకి వదిలారు. ఇక నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలకు, రామన్​పాడు ప్రాజెక్టులకు కూడా నీటిని వదులుతున్నారు.

జూరాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

ఇవీచూడండి: నీటి వివాదాల బిల్లుకు లోక్​సభ ఆమోదం

Tg_mbnr_15_31_jurala_update_avb_3068847 రిపోర్టర్ స్వామికిరాన్ కెమెరామెన్ శ్రీనివాస్ తెలంగాణలో కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుండటంతో జూరాలకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జూరాలకు లక్షా 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకోవడంతో వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1054 అడుగులు కాగా ప్రస్తుతం 1044 అడుగుల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9 పాయింట్ 6 5 7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.562టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. పవర్ హౌస్ ద్వారా సుమారు 20 నుంచి 30 వేల క్యూసెక్కులు కృష్ణా నదిలోకి విడుదల అవుతోంది. ఇది కాకుండా సుమారు లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని ద్ 24 గేట్ల ద్వారా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ఇక నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ,భీమా ఎత్తిపోతల పథకాలకు సైతం నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల ఆయకట్టుకు కుడి ఎడమ కాల్వల ద్వారా, రామన్ పాడు తాగునీటి పథకానికి సమాంతర కాలువ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఎగువ ప్రాంతాల నుంచి ఇదే స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు . దీంతో శ్రీశైలం జలాశయం పై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులను కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరితే తిరుగు జలాల ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సాగునీరు అందించనున్నారు. Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.