క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్పోర్ట్స్ కోటాలో యువతకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని.. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. యువతీయువకులు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, పట్టణ అధ్యక్షుడు సమాల మధుసూధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మేతి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతులకు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలి: భట్టి