ETV Bharat / state

చాపకింద నీరులా కరోనా.. మరో 10 కేసులు నమోదు - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు

భూపాలపల్లి జిల్లాలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆదివారం మరో 10 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొవిడ్​ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో స్థానికులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.

10 more corona positive cases registered in bhupalapalli district
చాపకింద నీరులా కరోనా.. మరో 10 కేసులు నమోదు
author img

By

Published : Jul 20, 2020, 10:43 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం తాజాగా మరో 10 మంది ఈ వైరస్​ బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధార్​సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు రసాయన ద్రావణాలు పిచికారీ చేయించారు.

మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్​ వ్యాప్తి తగ్గకపోవడం వల్ల అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం విధిగా పాటించాలని కోరుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం తాజాగా మరో 10 మంది ఈ వైరస్​ బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధార్​సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు రసాయన ద్రావణాలు పిచికారీ చేయించారు.

మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్​ వ్యాప్తి తగ్గకపోవడం వల్ల అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం విధిగా పాటించాలని కోరుతున్నారు.

ఇదీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.