తెరాస ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 69మంది లబ్ధిదారులకు రూ.69లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆడపడుచులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అద్భుత పథకమైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ను ప్రవేశపెట్టారన్నారు. దళారులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దని సూచించారు.
ఇదీ చదవండి: ధోనీ సలహాల వల్లే నటరాజన్ ఇలా!