ETV Bharat / state

Korutla BRS Councillor Husband Murder : కోరుట్లలో కలకలం.. బైక్​పై వచ్చి బీఆర్​ఎస్ కౌన్సిలర్ భర్తను నరికేశారు

author img

By

Published : Aug 8, 2023, 11:58 AM IST

Updated : Aug 8, 2023, 5:34 PM IST

Korutla BRS Councillor Husband Murder : జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కౌన్సిలర్ భర్తపై మంగళవారం ఉదయం.. గుర్తు తెలియని కొందరు దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. గమనించిన స్థానికులు ఆయణ్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Korutla councilor husband died
BRS councilor husband died in attack prostitutes

Korutla BRS Councillor Husband Murder : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానిక బీఆర్​ఎస్​ తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ భర్త.. పోగుల లక్ష్మీరాజం(48)పై గుర్తు తెలియని కొందరు దుండగులు మంగళవారం ఉదయం కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మెడపై తీవ్రగాయాలు కాగా.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందారు.

BRS Councillor Husband Murder in Korutla : పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద సమీపంలోని ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి ఆయనపై దాడి చేశారు. కత్తితో మెడపై తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితిని గమనించిన కొందరు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు బైక్​పై అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్ర గాయాలతో ఉన్న లక్ష్మీరాజంను స్థానికులు కరీంనగర్​లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే ఆయన మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రశాంతమైన కోరుట్ల పట్టణంలో ప్రజలు భయందోళనకు గురయ్యారు.

Young Mans Knife attack at Suryapet : సూర్యాపేటలో పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. కత్తులతో ప్రత్యర్థిపై దాడి

గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడని.. విద్యార్థిపై కత్తులతో దాడి

Brother killed in Property Disputes at Nalgonda : మరోవైపు ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్నయ్యని తన తమ్ముడే అతి దారుణంగా హత్య చేసిన ఘటన నల్లగొండ జిల్లా, అడవి దేవులపల్లి మండలం బాలెంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలెంపల్లిలో జాడ కాటమయ్య అనే వ్యక్తి వృద్ధాప్యంతో మంచానికే పరిమితమయ్యాడు. అతని సొంత కుమారుడు తండ్రిని పట్టించుకోకపోవడంతో కాటమయ్య తమ్ముడు కుమారుడైన జాడ కోటేశ్వరరావు అతని సపర్యలు చేస్తూ ఉన్నాడు.

ఈ క్రమంలో కాటమయ్య తన అరఎకరం భూమి కోటేశ్వర్‌రావుకు రాసిచ్చాడు. దీనిపై గొడవకు దిగిన సొంత కుమారుడు కాశయ్య... తన అన్న కోటేశ్వర్‌రావుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారైయాడు. తీవ్ర గాయాలపాలైనా కోటేశ్వర్‌రావు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలిని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి పరిశీలించారు.

మరో పరువు హత్య.. నడిరోడ్డుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. ఇద్దరు అరెస్ట్​

పంది కోసం గ్యాంగ్​వార్.. కార్లతో ఢీకొట్టి, కత్తులతో దాడి చేసి..

చేపల ధర తగ్గించమని అడిగితే.. కత్తితో పొడిచేశాడు!

Korutla BRS Councillor Husband Murder : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానిక బీఆర్​ఎస్​ తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ భర్త.. పోగుల లక్ష్మీరాజం(48)పై గుర్తు తెలియని కొందరు దుండగులు మంగళవారం ఉదయం కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మెడపై తీవ్రగాయాలు కాగా.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందారు.

BRS Councillor Husband Murder in Korutla : పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద సమీపంలోని ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి ఆయనపై దాడి చేశారు. కత్తితో మెడపై తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితిని గమనించిన కొందరు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు బైక్​పై అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్ర గాయాలతో ఉన్న లక్ష్మీరాజంను స్థానికులు కరీంనగర్​లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే ఆయన మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రశాంతమైన కోరుట్ల పట్టణంలో ప్రజలు భయందోళనకు గురయ్యారు.

Young Mans Knife attack at Suryapet : సూర్యాపేటలో పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. కత్తులతో ప్రత్యర్థిపై దాడి

గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడని.. విద్యార్థిపై కత్తులతో దాడి

Brother killed in Property Disputes at Nalgonda : మరోవైపు ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్నయ్యని తన తమ్ముడే అతి దారుణంగా హత్య చేసిన ఘటన నల్లగొండ జిల్లా, అడవి దేవులపల్లి మండలం బాలెంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలెంపల్లిలో జాడ కాటమయ్య అనే వ్యక్తి వృద్ధాప్యంతో మంచానికే పరిమితమయ్యాడు. అతని సొంత కుమారుడు తండ్రిని పట్టించుకోకపోవడంతో కాటమయ్య తమ్ముడు కుమారుడైన జాడ కోటేశ్వరరావు అతని సపర్యలు చేస్తూ ఉన్నాడు.

ఈ క్రమంలో కాటమయ్య తన అరఎకరం భూమి కోటేశ్వర్‌రావుకు రాసిచ్చాడు. దీనిపై గొడవకు దిగిన సొంత కుమారుడు కాశయ్య... తన అన్న కోటేశ్వర్‌రావుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారైయాడు. తీవ్ర గాయాలపాలైనా కోటేశ్వర్‌రావు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలిని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి పరిశీలించారు.

మరో పరువు హత్య.. నడిరోడ్డుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. ఇద్దరు అరెస్ట్​

పంది కోసం గ్యాంగ్​వార్.. కార్లతో ఢీకొట్టి, కత్తులతో దాడి చేసి..

చేపల ధర తగ్గించమని అడిగితే.. కత్తితో పొడిచేశాడు!

Last Updated : Aug 8, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.