ధనుర్మాస ఉత్సవాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా జరుగుతున్నాయి. మెట్పల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో గోదా రంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కల్యాణ తంతును భక్తిశ్రద్ధలతో జరిపారు.
వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కల్యాణ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ ప్లాన్ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?