జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుజ్జేటి గణేష్... తన పెద్దమ్మ లక్ష్మితో కలిసి మెట్పల్లికి పెళ్లిచూపుల కోసం వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన లారీ వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వీరి పైనుంచి వెళ్లింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మి మృతదేహం నుజ్జునుజ్జయిపోయింది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ప్రమాద ఘటనతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించి... అనంతరం మృతుల వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం