వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తరువాత వ్యాపార వర్గాలు సంతోషంగా ఉన్నాయని...అధికారుల ఒత్తిడి ఏమాత్రం లేదని జీఎస్టీ అదనపు కమిషనర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన వస్తు సేవల పన్ను కార్యశాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పలు వ్యాపార సంస్థలు వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి సకాలంలో రిటర్న్లు దాఖలు చేయడమే కాకుండా పన్నుల చెల్లింపులు జరగాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు చార్టెడ్ అకౌంటెంట్లు, పన్ను నిపుణులు పాల్గొని న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలు, రిటర్న్లు దాఖలు చేయడం వల్ల కలిగే ఇబ్బందులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడంలో పడుతున్న అవస్థలు తదితర అంశాలపై వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులకు వివరించారు.
ఇదీ చూడండి: నేటి జీఎస్టీ మండలి భేటీలో పన్ను రేట్ల తగ్గింపు!