ETV Bharat / state

ఆందోళన వద్దు.. అప్రమత్తత ఒక్కటే మార్గం: గవర్నర్​ - tamila sai speaks on modi

కరోనా వైరస్​ వ్యాప్తి దృష్ట్యా పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గవర్నర్​ తమిళిసై భరోసానిచ్చారు. స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. వైరస్​ కట్టడిపై కేంద్,ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

governor tamila sai
ఆందోళన వద్దు.. అప్రమత్తత ఒక్కటే మార్గం: గవర్నర్​
author img

By

Published : Mar 21, 2020, 6:02 AM IST

Updated : Mar 21, 2020, 6:46 AM IST

కరోనా వైరస్​ బారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రధాని మోదీ మంచి సందేశం ఇచ్చారని గవర్నర్​ తమిళిసై కొనియాడారు. కొవిడ్​-19 వ్యాప్తిని స్వీయ నియంత్రణతోనే కట్టడి చేయగలమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆందోళన వద్దు.. అప్రమత్తత ఒక్కటే మార్గం: గవర్నర్​

నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం స్వీయ గృహ నిర్బంధమే ఉత్తమమన్నారు. ఇంట్లోనే ఉండాలని.. ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు ఐసోలేషన్​లోనే ఉండాలన్నారు.

వైద్య సిబ్బంది, ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల కృషిని గవర్నర్​ ప్రశంసించారు. వారి కృషికి గుర్తింపుగా ప్రతి ఇంట్లో మార్చి 22న సాయంత్రం 5 గంటలకు చప్పట్లు, గంటలు మోగించి.. కృతజ్ఞతలు తెలపాలని కోరారు. రాజ్​ భవన్​లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో రాజ్​భవన్​లో​ పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్న గవర్నర్​​ తమిళిసై.. రోజూ ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పర్యేవేక్షిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటిని పాటించకుంటే వైరస్​ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.

ఇవీచూడండి: సీఎం కేసీఆర్​ కరీంనగర్​ పర్యటన వాయిదా

కరోనా వైరస్​ బారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రధాని మోదీ మంచి సందేశం ఇచ్చారని గవర్నర్​ తమిళిసై కొనియాడారు. కొవిడ్​-19 వ్యాప్తిని స్వీయ నియంత్రణతోనే కట్టడి చేయగలమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆందోళన వద్దు.. అప్రమత్తత ఒక్కటే మార్గం: గవర్నర్​

నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం స్వీయ గృహ నిర్బంధమే ఉత్తమమన్నారు. ఇంట్లోనే ఉండాలని.. ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు ఐసోలేషన్​లోనే ఉండాలన్నారు.

వైద్య సిబ్బంది, ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల కృషిని గవర్నర్​ ప్రశంసించారు. వారి కృషికి గుర్తింపుగా ప్రతి ఇంట్లో మార్చి 22న సాయంత్రం 5 గంటలకు చప్పట్లు, గంటలు మోగించి.. కృతజ్ఞతలు తెలపాలని కోరారు. రాజ్​ భవన్​లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో రాజ్​భవన్​లో​ పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్న గవర్నర్​​ తమిళిసై.. రోజూ ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పర్యేవేక్షిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటిని పాటించకుంటే వైరస్​ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.

ఇవీచూడండి: సీఎం కేసీఆర్​ కరీంనగర్​ పర్యటన వాయిదా

Last Updated : Mar 21, 2020, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.