ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బూడిదగట్టువారిపల్లికి చెందిన ముగ్గురు ఒంటరి మహిళలను.. గ్రామ బహిష్కరణ చేసి, ఆంక్షలు విధించారు ఆ ఊరి పెద్దలు. గ్రామానికి చెందిన కామేశ్వరి, సుహాసిని, కళావతి.. ఇంటి పట్టాల కోసం పోరాడి, సాధించుకున్నారు. కానీ గ్రామ పెద్దలు, ఊరిలో సెంటు భూమి కూడా ఇచ్చేందుకు వీలు లేదని తీర్మానం చేశారు.
ఇక చేసేదేమీ లేక ఈ ముగ్గురు మహిళలు పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. గ్రామస్థులపైనే ఫిర్యాదు చేస్తారా అని.. ఆగ్రహించిన ఊరి పెద్దలు, ముగ్గురు మహిళలను గ్రామం నుంచి బహిష్కరించి, ఆంక్షలు విధించారు. ఊరిలో జరిగే శుభకార్యాలకు వారు రాకూడదనీ.. వారి ఇళ్లకు గ్రామస్థులు వెళ్లకూడదనీ హుకుం జారీ చేశారు. తమ సమస్యను పోలీసులకు వివరించినా.. స్పందించలేదనీ.. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి: రూ.200లు ఎగ్గొట్టాడని కుల బహిష్కరణ!