హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రకృతికి దగ్గరగా వారిని తీసుకువచ్చేందుకు పంచతత్వ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఈ మేరకు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం యండమూరి ఎంక్లేవ్లో రూ. 11.91 లక్షలతో అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి పరిచిన పంచతత్వ పార్క్ను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రారంభించారు.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఈ పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్న ఈ పార్క్ ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద్ సూచించారు.
ఇదీ చదవండిః వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ