హైదరాబాద్ బంజారాహిల్స్లోని డయిరా ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర కళాఖండాల ప్రదర్శనను రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ దంపతులు ప్రారంభించారు. ప్రవీణ్కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
తన జీవితానుభవాలకు రూపమిచ్చిన సుమారు 31 చిత్తరువులు అపురూపంగా ఉన్నాయని ప్రవీణ్కుమార్ కొనియాడారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను తల్లిదండ్రులే ప్రారంభించడం ఆనందంగా ఉందని కళాకారిణి స్వేచ్ఛ.. సంతోషం వ్యక్తం చేశారు. తనను ప్రోత్సహించిన గురువుతోపాటు కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: భగత్ను గెలిపిస్తే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ: సీఎం కేసీఆర్