గుర్తు తెలియని వ్యక్తులు తన సినిమాను యూట్యూబ్లో అప్లోడ్ చేసి రూ. 40 లక్షల మేర నష్టాన్ని కలిగించారని దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరగడం లేదని ఆవేదనతో హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద పురుగుల మందు తాగాడు.
నానిగాడు పేరుతో నిర్మించిన సినిమాకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేశాడు. ఆ చిత్రంలో నటించిన దుర్గాప్రసాద్ ఫిల్మ్ చాంబర్కు చేరుకుని పురుగుల మందు సేవించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టుపై కౌంటర్ దాఖలు చేయండి: ఎన్జీటీ