హైదరాబాద్లో ఒక్క రోజు దీక్ష చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి దీక్ష విరమించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం చాడకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
రమణ
లాక్డౌన్తో అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఎల్.రమణ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సీపీఐ నాయకులు చేసిన దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.
కోదండరాం
కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. వలస కార్మికులందరికీ ప్రభుత్వం సహాయం అందించాలని ఆయన సూచించారు. కార్మికుల పక్షాన దీక్ష చేస్తున్న సీపీఐ నేతలను అభినందించిన కోదండరాం... కూలీల బాగోగుల గురించి ఆలోచించాలన్నారు.
నారాయణ
రైతులు, వలస కూలీల పక్షాన పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు సాయం చేయమంటే మద్యం దుకాణాలకు అనుమతిచ్చారని కేంద్రాన్ని తూర్పరబట్టారు.