ETV Bharat / state

Tamilisai: చెన్నైకి కృష్ణకుమారి భౌతికకాయం.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు

author img

By

Published : Aug 18, 2021, 4:01 PM IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి భౌతికకాయాన్ని రాజ్​భవన్​ నుంచి చైన్నై తరలించారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ప్రతినిధులు నివాళులు అర్పించారు.

Tamilisai
చెన్నైకి కృష్ణకుమారి భౌతికకాయం.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు

రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ మాతృమూర్తి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్​ తమిళిసై సౌందరాజన్​ మాతృమూర్తి కృష్ణకుమారిని(80) రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. కృష్ణకుమారి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూశారు. పలువురి సందర్శనార్ధం పార్థివదేహాన్ని రాజ్​భవన్​కు తరలించారు.

tamilisai mother Krishna Kumari's dead body moved to Chennai
కృష్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మంత్రులు

పలువురి సందర్శనార్థం పార్థివదేహాన్ని రాజ్​భవన్​కు తరలించారు. కృష్ణకుమారి పార్థివదేహానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్​, తలసాని గవర్నర్ తల్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్​ను పరామర్శించారు.

tamilisai mother Krishna Kumari's dead body moved to Chennai
కృష్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మంత్రులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా తమిళనాడు ఇంచార్జ్ పి.సుధాకర్ రెడ్డి, తమిళనాడు సీఎంఎంకే స్టాలిన్, ఆల్ ఇండియా భాజాపా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోష్, హరియణ గవర్నర్ బండారు దత్తాత్రేయలు గవర్నర్ తమిళసైకి ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కృష్ణకుమారి పార్థివదేహాన్ని రాజ్​భవన్ నుంచి చెన్నయ్​కు తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని రాజ్​భవన్ వర్గాలు తెలిపాయి.

GOVERNOR TAMILISAI: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ మాతృమూర్తి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్​ తమిళిసై సౌందరాజన్​ మాతృమూర్తి కృష్ణకుమారిని(80) రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. కృష్ణకుమారి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూశారు. పలువురి సందర్శనార్ధం పార్థివదేహాన్ని రాజ్​భవన్​కు తరలించారు.

tamilisai mother Krishna Kumari's dead body moved to Chennai
కృష్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మంత్రులు

పలువురి సందర్శనార్థం పార్థివదేహాన్ని రాజ్​భవన్​కు తరలించారు. కృష్ణకుమారి పార్థివదేహానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్​, తలసాని గవర్నర్ తల్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్​ను పరామర్శించారు.

tamilisai mother Krishna Kumari's dead body moved to Chennai
కృష్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మంత్రులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా తమిళనాడు ఇంచార్జ్ పి.సుధాకర్ రెడ్డి, తమిళనాడు సీఎంఎంకే స్టాలిన్, ఆల్ ఇండియా భాజాపా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోష్, హరియణ గవర్నర్ బండారు దత్తాత్రేయలు గవర్నర్ తమిళసైకి ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కృష్ణకుమారి పార్థివదేహాన్ని రాజ్​భవన్ నుంచి చెన్నయ్​కు తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని రాజ్​భవన్ వర్గాలు తెలిపాయి.

GOVERNOR TAMILISAI: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.