రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్ తమిళిసై సౌందరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారిని(80) రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. కృష్ణకుమారి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూశారు. పలువురి సందర్శనార్ధం పార్థివదేహాన్ని రాజ్భవన్కు తరలించారు.
పలువురి సందర్శనార్థం పార్థివదేహాన్ని రాజ్భవన్కు తరలించారు. కృష్ణకుమారి పార్థివదేహానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, తలసాని గవర్నర్ తల్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ను పరామర్శించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా తమిళనాడు ఇంచార్జ్ పి.సుధాకర్ రెడ్డి, తమిళనాడు సీఎంఎంకే స్టాలిన్, ఆల్ ఇండియా భాజాపా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోష్, హరియణ గవర్నర్ బండారు దత్తాత్రేయలు గవర్నర్ తమిళసైకి ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కృష్ణకుమారి పార్థివదేహాన్ని రాజ్భవన్ నుంచి చెన్నయ్కు తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
GOVERNOR TAMILISAI: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మాతృవియోగం