మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని ఎస్సీ గురుకుల మహిళ న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్బీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. ఈనెల 25న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అడ్మిషన్లు ఉంటాయని వివరించారు.
లాసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ న్యాయ కళాశాలలో ఎస్సీలకు 50, బీసీ, మైనారిటీ, ఓసీ, బీసీ-సీలకు నాలుగు చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in వెబ్ సైట్ను సంప్రదించాలని సూచించారు.