కరోనా మహమ్మారి నిర్మూలనలో రాజకీయాలకతీతంగా ప్రజలను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని దోమలగూడ, గాంధీ నగర్, అడిక్మెట్ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు మాస్కులు పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనిల్కుమార్ విమర్శించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ రెండో డోసు కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కవిత, మహేష్, కృష్ణ, రాజు, వెంకట రెడ్డి, విక్కీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో జాలరులకు చిక్కిన వింత చేప