ETV Bharat / state

50 మంది కళాకారులతో 'వన్​ ఇండియా కాన్సర్ట్​' - one india concert on may 31

లాక్​డౌన్​ వల్ల దేశంలోని వివిధ రంగాలతో పాటు ఈవెంట్​ మేనేజ్​మెంట్​ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా మారింది. మే31న ప్రపంచ ఈవెంట్ మేనేజర్స్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని 50 మందికి పైగా కళాకారులతో ఐఈపీఏ ఆధ్వర్యంలో వన్​ ఇండియా కాన్సర్ట్​ను చేపట్టనున్నారు. కొవిడ్ కాలంలో కష్టపడేవారి కోసం నిధుల సేకరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

one india concert to help event managers who lost job  during lockdown
50 మంది కళాకారులతో 'వన్​ ఇండియా కాన్సర్ట్​'
author img

By

Published : May 30, 2020, 3:38 PM IST

మార్చి 23, 2020న ప్రధాని మోదీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి ఏదో తెలీని మార్పు ఏర్పడింది. వ్యాపారాలు, రవాణా... ఆఖరికి ప్రజల జీవనశైలి కూడా లాక్​డౌన్​ మోడ్​లోకి వెళ్లిపోయాయి. ఈ దెబ్బతో అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈవెంట్​ మేనేజ్​మెంట్​ పరిశ్రమలపై భారీగా పడిందని ఓ నివేదిక తెలిపింది.

ఆ నివేదికల ప్రకారం ఈవెంట్​ మేనేజర్లకు ఏప్రిల్​ నుంచి జులై వరకు మాత్రమే 93 శాతం ఆదాయం వస్తుందని... లాక్​డౌన్​ వల్ల అవి కూడా రద్దు అయ్యాయని ఆ రంగ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ పరిశ్రమలో ఎక్కువ శాతం ప్రొడక్టివిటీతోనే పనిచేస్తారు. లాక్​డౌన్​లో ఆ పనులేం లేక.. ఉపాధి కోల్పోయారు.

ఇలాంటి సమయంలో వారంతా చేతులు కలిపి.. ఈ విపత్కర పరిస్థితి నుంచి కొత్త మార్గాలను స్వీకరించేందుకు అవకాశంగా మార్చుకుని నిజమైన వ్యాపార స్ఫూర్తిని చూపించేందుకు నిర్ణయించారు. ప్రపంచ ఈవెంట్ మేనేజర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఈపీఏ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో 50 మంది కళాకారులు కలిసి మే 31న వన్​ ఇండియా కాన్సర్ట్​ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర, అసోం, బిహార్, కర్ణాటక, పంజాబ్​.. తదితర ప్రాంతాలకు సంబంధించిన కళాకారులు పాల్గొననున్నారు.

ఇది కేవలం ప్రజలకు ఉల్లాస పరచడానికి అనుకుంటే పొరబడినట్లే. ఈ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్​ కాలంలో ఉపాధులు కోల్పోయి ఇబ్బంది పడుతున్నవారికి అందజేయనున్నట్లు ఇండియన్​ ఈవెంట్ ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​ (ఐఈపీఏ)లో ప్రముఖ సభ్యులు సంజీవ్​ దే తెలిపారు. మూడు వందల మంది కృషితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

మార్చి 23, 2020న ప్రధాని మోదీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి ఏదో తెలీని మార్పు ఏర్పడింది. వ్యాపారాలు, రవాణా... ఆఖరికి ప్రజల జీవనశైలి కూడా లాక్​డౌన్​ మోడ్​లోకి వెళ్లిపోయాయి. ఈ దెబ్బతో అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈవెంట్​ మేనేజ్​మెంట్​ పరిశ్రమలపై భారీగా పడిందని ఓ నివేదిక తెలిపింది.

ఆ నివేదికల ప్రకారం ఈవెంట్​ మేనేజర్లకు ఏప్రిల్​ నుంచి జులై వరకు మాత్రమే 93 శాతం ఆదాయం వస్తుందని... లాక్​డౌన్​ వల్ల అవి కూడా రద్దు అయ్యాయని ఆ రంగ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ పరిశ్రమలో ఎక్కువ శాతం ప్రొడక్టివిటీతోనే పనిచేస్తారు. లాక్​డౌన్​లో ఆ పనులేం లేక.. ఉపాధి కోల్పోయారు.

ఇలాంటి సమయంలో వారంతా చేతులు కలిపి.. ఈ విపత్కర పరిస్థితి నుంచి కొత్త మార్గాలను స్వీకరించేందుకు అవకాశంగా మార్చుకుని నిజమైన వ్యాపార స్ఫూర్తిని చూపించేందుకు నిర్ణయించారు. ప్రపంచ ఈవెంట్ మేనేజర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఈపీఏ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో 50 మంది కళాకారులు కలిసి మే 31న వన్​ ఇండియా కాన్సర్ట్​ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర, అసోం, బిహార్, కర్ణాటక, పంజాబ్​.. తదితర ప్రాంతాలకు సంబంధించిన కళాకారులు పాల్గొననున్నారు.

ఇది కేవలం ప్రజలకు ఉల్లాస పరచడానికి అనుకుంటే పొరబడినట్లే. ఈ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్​ కాలంలో ఉపాధులు కోల్పోయి ఇబ్బంది పడుతున్నవారికి అందజేయనున్నట్లు ఇండియన్​ ఈవెంట్ ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​ (ఐఈపీఏ)లో ప్రముఖ సభ్యులు సంజీవ్​ దే తెలిపారు. మూడు వందల మంది కృషితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.