రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని... వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మెట్రోవాటర్ వర్క్స్ అండ్ సెవరేజ్ బోర్డు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతికేళ్ల క్రితమే జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించలేదని ఆచారి ఆరోపించారు. దేశంలో అధికంగా ఉన్న వెనకబడ్డ కులాలకు న్యాయం చేయడానికి... వారి హక్కులను కాపాడటానికే ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారని తెలిపారు. బీసీలపై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమైందని ఆచారి విమర్శించారు.
ఇవీ చూడండి: డిగ్రీ ప్రవేశాలపై తగ్గిన విద్యార్థుల ఆసక్తి