లింగంపల్లి- తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణ వేళలు మారాయి. కొత్త షెడ్యూల్ ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. లింగంపల్లి స్టేషన్ నుంచి సాయంత్రం 5.15 కి బదులుగా... 5.30కి బయలుదేరుతుంది. బేగంపేటకు సాయంత్రం 5.50కి, సింకింద్రాబాద్ 6.15, బీబీనగర్ 7.40 , నల్గొండ 5 గంటలకు, మిర్యాలగూడ 8.24, నడికుడు 8.57, పిడుగురాళ్ల 9.18, సత్తెనపల్లి 9.47, గుంటూరుకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. తెనాలి, రేణిగుంట స్టేషన్ల మధ్య ప్రయాణవేళల్లో తేడా లేదు. తిరుపతికి ఉదయం 6.05 కి బదులు 6 గంటలకు చేరుకుంటుంది. గుంటూరులో 15 నిమిషాలకు బదులు 10 నిమిషాలు ఆగుతుంది.
ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి