ETV Bharat / state

రైతు బీమాను వ్యవసాయ కూలీలకు వర్తింపజేయాలి: జీవన్ రెడ్డి - Debate in the Legislative Council on the Budget

రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. శాసన మండలిలో బడ్జెట్​పై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

mlc-jeevan-reddy-said-the-state-government-should-take-steps-to-support-agricultural-laborers
రైతు బీమాను వ్యవసాయ కూలీలకు వర్తింపజేయాలి:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
author img

By

Published : Mar 23, 2021, 4:11 AM IST

రైతు బీమా పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కోరారు. శాసన మండలిలో బడ్జెట్​పై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల మంది గల్ఫ్‌ కార్మికులు చనిపోయారన్న ఆయన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్ధులకు గురుకులాలలో 75 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించి.. ఏకగ్రీవాలు జరిగిన పంచాయతీలకు రూ.10లక్షలు నజరానా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైతు బీమా పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కోరారు. శాసన మండలిలో బడ్జెట్​పై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల మంది గల్ఫ్‌ కార్మికులు చనిపోయారన్న ఆయన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్ధులకు గురుకులాలలో 75 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించి.. ఏకగ్రీవాలు జరిగిన పంచాయతీలకు రూ.10లక్షలు నజరానా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మరఠ్వాడకు ఇచ్చారు.. మరి కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ ఏమైంది.?: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.