కరోనా భాదితుల కుటుంబసభ్యులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కొందరు వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్యులు, వైద్యసిబ్బందిని గౌరవించాలని.... ఏవైనా సమస్యలు ఉంటే తగిన మార్గంలో పరిష్కరించుకోవాలని అసద్ సూచించారు.
అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. ప్రభుత్వానికి, వైద్యులకు సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.