ETV Bharat / state

రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో రాగల రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.

author img

By

Published : Dec 27, 2020, 3:32 PM IST

రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి రెండు ప్రదేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజుల పాటు ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి రెండు చోట్ల శీతల గాలుల పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని సంచాలకులు వివరించారు.

రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి రెండు ప్రదేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజుల పాటు ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి రెండు చోట్ల శీతల గాలుల పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని సంచాలకులు వివరించారు.

ఇదీ చదవండి: రుణ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.