భాజపా సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ రూపంలో బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈనెల10న కిషన్ రెడ్డి సీసీఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్ నుంచి కాల్ చేసి చంపుతామని అజ్ఞాత వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇవీ చూడండి: 'పాతాళంలో భారత్-పాక్ బంధం.. మోదీపైనే భారం'