ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతులను సద్వినియోగం చేసుకోండి

కరోనా దెబ్బకు దేశమే ఇంటికి పరిమితం అయ్యింది. ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆన్​లైన్​ తరగతులకు శ్రీకారం చుట్టారు.

author img

By

Published : Jun 7, 2020, 5:04 PM IST

Hyderabad Sundaraiah vignana kendram conducted online classes for students
విద్యార్థుల కోసం ఆన్​లైన్​ తరగతులు

ఇప్పటికే చాలా ప్రైవేట్‌ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు డిజిటల్‌ బోధనకు తెరతీశాయి. ఇక చాలా పాఠశాలలు ఆన్​లైన్ క్లాస్​లకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఆన్​లైన్ గణిత​ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు కార్యదర్శి వినయ్​ కుమార్​ వెల్లడించారు.

ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 45 రోజులపాటు సాగే ఈ తరగతులను జయపద్రం చేయాలని కోరారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను ప్రజలందరూ పాటించాలని పేర్కొన్నారు.

ఇప్పటికే చాలా ప్రైవేట్‌ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు డిజిటల్‌ బోధనకు తెరతీశాయి. ఇక చాలా పాఠశాలలు ఆన్​లైన్ క్లాస్​లకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఆన్​లైన్ గణిత​ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు కార్యదర్శి వినయ్​ కుమార్​ వెల్లడించారు.

ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 45 రోజులపాటు సాగే ఈ తరగతులను జయపద్రం చేయాలని కోరారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను ప్రజలందరూ పాటించాలని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.