ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. హైదరాబాద్లో నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద నగర ప్రజలు బారులు తీరుతున్నారు. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని కోరారు.
శానిటేషన్ చేశాకే...
నగరంలోని పలు దుకాణాలకు జనాలు ఎక్కువగా రావడం వల్ల కొందరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. శానిటేషన్తో చేతులు శుభ్రం చేశాకే లోపలికి పంపుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తరలివస్తున్నారు. వైన్ షాప్ల వద్ద కూడా జనాలు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేపట్టారు.