అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ కాగా.. 20 రోజుల క్రితం అత్తింటి నుంచి సౌమ్య బయటకు వెళ్లిపోయింది. తల్లి ఆమెను సముదాయించి పుట్టింటికి తీసుకొచ్చింది. మానసికంగా కుంగిపోయిన సౌమ్య ఈరోజు ఉదయం అఘాయిత్యానికి పాల్పడింది. సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌమ్య నాలుగు నెలల గర్భవతిగా డాక్టర్లు గుర్తించారు.
ఇవీ చూడండి: నగరవాసులను రారమ్మంటున్న జంగిల్ ఫారెస్ట్ క్యాంప్