ఈ నెల 6న దుబాయ్లో జరిగిన టేబుల్ సాకర్ పోటీల్లో సత్తాచాటి పతకాలు సాధించిన హైదరాబాద్ క్రీడాకారులు మరియా తనీమ్, జాకీర్ అలీఖాన్ తిరిగి నగరానికి చేరుకున్నారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
సైదాబాద్కు చెందిన మరియా తనీమ్, టోలీచౌకికి చెందిన నివాసి జాకీర్ అలీఖాన్ దుబాయ్లో జరిగిన టేబుల్ సాకర్ జూనియర్ సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా దేశాల క్రీడాకారులతో తలపడి రజత, కాంస్య పతకాలు సాధించారు.
మరియా తనీమ్ సలీంనగర్లోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి, జాకీర్ అలీఖాన్ ఇంటిగ్రీన్ ఫౌండేషన్లో ఎనిమిదో తరగతి అభ్యసిస్తున్నారు. వీరిద్దరు ఏప్రిల్లో నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన ఇన్వెటేషన్ టోర్నమెంట్లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.
వీరిద్దరిని తెలంగాణ గురుకుల పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అబ్ధుల్ ఖాదర్, ఇంటిగ్రేడ్ ఫౌండేషన్ ప్రధానోపాధ్యాయుడు సారా సుల్తానా అభినందించారు.
ఇవీ చూడండి: ఏఎన్-32 విమానం శకలాలు గుర్తింపు