హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తితిదే నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తీసిపోని విధంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ఉత్సవాలకు హాజరవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: కేంద్ర నిర్ణయం దేశద్రోహాన్ని తలపిస్తోంది: యూఎఫ్బీయూ