ETV Bharat / state

కరోనా వ్యాప్తి నివారణకు జీహెచ్​ఎంసీ చర్యలు - kovid- 19 measures updates

రాజధాని నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో పర్యటించి శానిటేషన్ పనులను తనిఖీ చేశారు.

GH MC measures to prevent corona outbreak
కరోనా వ్యాప్తి నివారణకు జీహెచ్​ఎంసీ చర్యలు
author img

By

Published : Mar 17, 2020, 8:15 PM IST

Updated : Mar 17, 2020, 9:49 PM IST

హైదరాబాద్​లో కొవిడ్- 19 వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్.. ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌లలో పర్యటించి శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల రక్షణకు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న గ్లౌస్‌లు, మాస్క్‌లు శానిటైజర్లు ఉపయోగించాలని మేయర్ సూచించారు.

సకాలంలో విధులకు హాజరుకాని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే శానిటరీ వర్కర్లు అసిస్టెంట్లు సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ హెచ్చరించారు. కరోనా వైరస్ పరిస్థితులను నిరంతరం ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. మరోవైపు నగరంలో తెరిచి ఉంచిన 66 సంస్థలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సీజ్‌ చేశారు.

ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంస్థల్లో యాజమాన్యాలు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వజిత్ తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణకు జీహెచ్​ఎంసీ చర్యలు

ఇదీ చూడండి: ఆర్​బీఐ అభయంతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

హైదరాబాద్​లో కొవిడ్- 19 వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్.. ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌లలో పర్యటించి శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల రక్షణకు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న గ్లౌస్‌లు, మాస్క్‌లు శానిటైజర్లు ఉపయోగించాలని మేయర్ సూచించారు.

సకాలంలో విధులకు హాజరుకాని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే శానిటరీ వర్కర్లు అసిస్టెంట్లు సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ హెచ్చరించారు. కరోనా వైరస్ పరిస్థితులను నిరంతరం ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. మరోవైపు నగరంలో తెరిచి ఉంచిన 66 సంస్థలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సీజ్‌ చేశారు.

ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంస్థల్లో యాజమాన్యాలు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని విశ్వజిత్ తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణకు జీహెచ్​ఎంసీ చర్యలు

ఇదీ చూడండి: ఆర్​బీఐ అభయంతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

Last Updated : Mar 17, 2020, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.