హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో గంగపుత్ర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గంగపుత్రులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రంలోని అన్ని చెరువులపై తమ కులస్థులకే హక్కులు కల్పించాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. లక్ష్మణ్ బెస్త డిమాండ్ చేశారు. జీవో 6ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై వేద వ్యాస్, భీష్మతో పాటు గంగపుత్ర సంఘం వ్యవస్థాపకులు బాలయ్య బెస్త విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు.
నెక్లెస్ రోడ్లో గంగామాత ఆలయం నిర్మించాలని ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు టీ.సత్యం బెస్త డిమాండ్ చేశారు. గంగపుత్ర సొసైటీలో 90 శాతం ఉద్యోగాలు తమ కులానికి చెందిన వారికే కేటాయించాలన్నారు. తమ సొసైటీల్లో ఇతర కుల నాయకులు, రాజకీయ నేతల జోక్యం ఉండరాదని స్పష్టం చేశారు.