హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ బెయిల్ గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. బెయిల్ గడువు పొడిగింపు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులన్నింటిని పాటిస్తున్నందున.... గడువు పొడిగించాలని ఆమె తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. చెల్లింపులు, విచారణకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లు సమర్పించేందుకు గడువు కోరుతూ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అనుమతించింది.
ఈ కేసులో తమను చేర్చాలంటూ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను నాయస్థానం అంగీకరించింది. కేసు తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.... అప్పటి వరకు నౌహీరా షేక్ బెయిల్ గడువును పొడిగించింది.
ఇదీ చూడండి: హీరాగోల్డ్ కేసు: నౌహీరాషేక్కు బెయిల్ మంజూరు